ముగించు

చరిత్ర

నెల్లూరు జిల్లా తూర్పున బంగాళాఖాతం సరిహద్దుగా 163 కి.మీ.ల పొడవైన  తూర్పు తీరంతో రాష్ట్రం యొక్క ఆగ్నేయ భాగంలో  ఉంది. ఈ జిల్లా 13 వ శతాబ్దం వరకు విక్రమా సింహపురిగా  పేరుగాంచి తదుపరి  నెల్లూరు గా పిలువబడింది

చారిత్రాత్మకంగా ఈ జిల్లా మౌర్యుల , శాతవాహనుల , పల్లవుల, చోళుల, తెలుగు  చోళుల, కాకతీయ, పాండ్యనుల పరిపాలనలో ఉండేది.  ప్రసిద్ధ తెలుగు కవి తిక్కన సోమయాజీ నెల్లూరులో సంస్కృత మహాభారతం యొక్క 15 పర్వాలను తెలుగులోకి అనువదించారు.

నెల్లూరు జిల్లా 1953 అక్టోబరు 1 వరకు మద్రాసు రాష్ట్రం సంయుక్త రాష్ట్రంలో భాగంగా ఏర్పడింది.  నవంబరు 1, 1956 న రాష్ట్రాలు ఒక భాషా పద్ధతిలో పునర్వ్యవస్థీకరించబడినప్పుడు ఈ జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలోకి వచ్చింది.

నెల్లూరు జిల్లా పేరును జూన్ 4, 2008 న శ్రీ పోట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చారు.