ఎ) శాఖ / సంస్థ గురించి పరిచయం:
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మైనారిటీస్ ఆర్ధిక సంస్థ 1985 సంవత్సరము జనవరి 19 వ తేదిన కంపెనీల చట్టం క్రింద రాష్ట్ర ప్రభుత్వం చే స్థాపించబడినది. ఈ సంస్థ మన రాష్ట్రం లోని సాంఘీకముగా, ఆర్ధికముగా, వెనుకబడిన మైనారిటీస్ అయిన ముస్లిములు, క్రిస్టియన్లు, పార్శికులు, సిక్కులు, భౌద్ధులు మరియు జైనులు మొదలగు వారికి అర్దికాభివ్రుద్దికి తోడ్పడే ముఖ్యఉద్దేశ్యముతో స్థాపించబడినది. 2011 జనాభా లెక్కల ప్రకారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మొత్తం జనాభా 29,63,557 ఇందులో మైనారిటీ జనాభా 3,18,107 (ముస్లింలు-2,88,378, క్రైస్తవులు-26,202, సిక్కులు-678, భౌద్ధులు-239 మరియు జైనులు-2,610).