ఎ) శాఖ / సంస్థ గురించి పరిచయం:
జిల్లాలో భూగర్భ జల మట్టములను పరిశీలించి రికార్డు చేయటము జరుగుచున్నది. దీనికొరకు 100 పిజోమీటర్లతో కూడిన ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసి వీటిలో 95 పిజోమీటర్లో ఆటోమేటిక్ వాటర్ లెవెల్ రికార్డులు అనే పరికరములను అమర్చి, భూగర్భ జలాలను నిరంతరము గంటకొకసారి కొలిచి, కంప్యూటర్ సర్వరుకు పంపటం జరుగుచున్నది. ఈ నీటి మట్టములను ఎవరైనా CM Dashboard నందు Ground Water విభాగములో చూసుకొనవచ్చును.
దీనితో పాటుగా భూగర్భజల శాఖ షెడ్యూల్డ్ జాతులు, షెడ్యూల్డ్ తెగల వారి భూములందు భూగర్భజల సర్వేలు నిర్వహించి, ఉపప్రణాలికలో భాగముగా బోర్లు నిర్మించి ఇవ్వండం జరుగుచున్నది. ప్రైవేటు వ్యక్తుల భూములలో రుసుము వాసులు చేసి భూగర్భజల సర్వేలు నిర్వహించి, ఎక్కువ నీరు వచ్చే స్థలములను గుర్తించి, సాంకేతిక సలహాలు ఇవ్వడం జరుగుచున్నది. సింగల్ విండోద్వార పొందిన దరఖాస్తులను పరిశీలించి,సర్వేలునిర్వహించి తగిన నివేదికలు మరియు సాంకేతిక సలహాలు భూగర్భజల శాఖ ఇస్తుంది.
అంతే కాకుండా చెక్ డాములు, ఊట చెరువులు నిర్మించే ప్రదేశములలో Infiltration test నిర్వహించబడి సిఫారసు చేయబడుతున్నాయి.
అంతే కాకుండా గనుల సిఫారసు మరియు రొయ్యల చెరువుల సిఫారసు కమిటీల యందు సభ్యులుగా ఉండి, తగిన పాత్ర వహించుచున్నది.